భీమవరం కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన పీజీఆర్ఎస్ను అంబేడ్కర్ జయంతి సందర్భంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. జిల్లాలోని మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీలో జరగాల్సిన ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమం జరగదని అన్నారు. కావున పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.