పశ్చిమగోదావరి జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు మొత్తం 17, 257 మంది పరీక్షకు హాజరుకాగా 12, 406 మంది పాసయ్యారు. 70% ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 14, 260 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 11, 948 మంది పాసయ్యారు. 84% ఉత్తీర్ణత నమోదయింది.