జంగారెడ్డిగూడెంలో గత మూడు రోజుల క్రితం ప్రియుడు, కన్నతల్లి చేతిలో చిత్రహింసలకు గురైన చిన్నారులకు చికిత్స అందిస్తున్నామని ఆర్డీవో రమణ అన్నారు. మంగళవారం ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ. చికిత్స అనంతరం కలెక్టర్ ఆదేశాలపై వారిని చిల్డ్రన్స్ హోమ్కు తరలిస్తున్నామన్నారు. వారి పేరు మీద జాయింట్ అకౌంట్ను ఓపెన్ చేశామని దాతలు ఎవరైనా ఉంటే స్పందించాలని కోరారు.