ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం రాత్రి పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. స్థానిక బస్టాండ్ వద్ద ప్రతి వాహనాన్ని డిఎస్పీ రవిచంద్ర నేతృత్వంలో సోదాలు చేశారు. అనుమానిత, మత్తు పదార్థాల నియంత్రణే లక్ష్యంగా ఈ తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. వాహనానవాహనాల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఎస్సై, సీఐ, సిబ్బంది ఉన్నారు.