కేంద్ర బడ్జెట్, ఫీజుపోరు, గీతకార్మికుల మద్యం రిజర్వేషన్లపై జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ ఈసారి ఏపీ అభివృద్ధికి ఎంతో ఉపయోగకారిగా ఉందని, పోలవరం, అమరావతి, స్టీల్ ప్లాంట్, పారిశ్రామిక కారిడార్, రైల్వే ప్రాజెక్టులు వ్యవసాయ రంగాలకు అధిక నిధులు కేటాయించారన్నారు.