జంగారెడ్డిగూడెం మండలం వేగవరం జాతీయ రహదారిపై గురువారం పెట్రోల్ బాటిళ్లతో దుకాణ యజమానులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రోడ్డు పక్కన ఉన్న చిన్న దుకాణాలను తొలగించాలని అధికారులు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. దుకాణాలు తొలగిస్తే ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున దీనిపై అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.