12 తెలంగాణ మద్యం సీసాలు కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సీఐ శ్రీనుబాబు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం శుక్రవారం మండలంలోని ఏ. పోలవరం గ్రామానికి చెందిన వ్యక్తి మద్యం సీసాలు కలిగి ఉన్నాడనే సమాచారంతో దాడులు చేసి మద్యం సీసాలు పట్టుకున్నామన్నారు. ఈ దాడులలో ఎస్ఐ సుబ్రహ్మణ్యం, సిబ్బంది పాల్గొన్నారు.