జంగారెడ్డిగూడెం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా బజార్ను చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఏ సందర్భంగా డ్వాక్రా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేశారన్నారు. అలాగే నాణ్యమైన వస్తువులకు ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు.