జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శివారులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాడేపల్లిగూడెంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు అద్దెకు కారు తీసుకుని భద్రాచలం బయలుదేరారు. ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టడంతో కోమటి స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమోద్, అజయ్, రాహుల్, హరిహరన్, హేమంత్ గాయపడ్డారు. పోలీసులు దీనిపై వివరాలు సేకరిస్తున్నారు.