జీలుగుమిల్లి మండల పరిధిలో 33కేవీ విద్యుత్ లైన్ మైసన్నగూడెం ఫీడర్పై ట్రీ కటింగ్, లైన్ మరమ్మతులు కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని జంగారెడ్డిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 01: 30 వరకు ములగలంపల్లి, పి. నారాయణపురం, రాచన్నగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, రాజీవ్నగర్ ఆయా సబ్ స్టేషన్ల పరిధిలో గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.