
మే 31 నాటికి ఈ అకౌంట్లలో రూ.436 ఉండాలి.. లేదంటే ఖాతాలు రద్దు
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(PMJJBY)లో భాగంగా పాలసీని కొనసాగించాలనుకునే ఖాతాదారులు మే 31లోపు తమ బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతాలో కనీసం రూ.436 ఉండేలా చూసుకోవాలని RBI ప్రకటించింది. నిర్ణీత గడువులోపు డబ్బు లేకపోతే పాలసీ రద్దు అవుతుందని RBI స్పష్టం చేసింది. అంతేగాక, KYC పత్రాలు సమర్పించని ఖాతాదారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏడాదికి రూ.436 ప్రీమియంతో ఈ బీమా పథకం అందుబాటులో ఉంది.