జంగారెడ్డిగూడెం మండలం వేగవరం నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. జంగారెడ్డిగూడెం ఎస్సై జాబిర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ రచన చేసి భారత దేశ భవిష్యత్తుకు ఒక దిశ నిర్దేశం చేశారని ఒక గొప్ప విద్యావేత్త, మేధావి అని అన్నారు.