ఓ యువకుడు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ప్రమాదవశాత్తు మృఠీ చెందిన ఘటన దెందులూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దెందులూరు మండలంలోని కొవ్వలికి చెందిన ప్రవీణ్ (20) మెకానిక్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిన్న ఉదయం రైలు పట్టాలపై బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా.. రైలు ఢీకనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే ఎస్ఐ సైమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.