పెదవేగి సచివాలయంలో అర్ధరాత్రి కలకలం

79చూసినవారు
పెదవేగి సచివాలయంలో అర్ధరాత్రి కలకలం
ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో ఓ పంచాయతీ కార్యదర్శి తను పనిచేస్తున్న సచివాలయానికి గురువారం అర్ధరాత్రి సమయంలో ఓ యువతిని రహస్యంగా తీసుకెళ్లడంతో గ్రామ యువకులు పసిగట్టి ఆ కార్యదర్శి, ఆ యువతిని నిర్బంధించారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో కార్యదర్శితో వచ్చిన యువతి అక్కడ నుండి చాక చక్యంగా స్కూటీ పై చీకటి మాటున పారిపోయిందని సమాచారం. కాగా కార్యదర్శిని గ్రామస్తులు దేహశుద్ధి చేసినట్టు సమాచారం. ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్