పెదవేగి మండలం దుగ్గిరాల టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని పలు గ్రామాలకు చెందిన ప్రజలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన వారి వద్ద నుండి వినతులు స్వీకరించారు. అనంతరం సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.