దెందులూరు నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిత్యం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటిని సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించే విధంగా ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేశారు.