పెదవేగి మండలం పెదకడిమికి చెందిన నెరుసు రాటాలు (40) వ్యవసాయం చేస్తూ అప్పుల పాలయ్యారు. ఈ క్రమంలో మనస్తాపం చెంది ఈ నెల 6న ఇంట్లో పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు ఏలూరులోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆయన కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.