మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరులో శుక్రవారం జరిగింది. పవర్ పేటలోని ఓ స్కూల్లో విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయి. బాగా చదవాలని తల్లిదండ్రులు విద్యార్థిని మందలించారు. మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.