రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తంకుమార్ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో మహిళా అభ్యుదయ సంఘం, జిల్లా అధికార సంస్థ సంయుక్తంగా మహిళా చట్టాలపై అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. సదస్సులో ట్రైనీ జడ్జిలు రాజరాజేశ్వరి, తేజస్విని, లక్ష్మీలావణ్య, రంజిత్కుమార్ పాల్గొన్నారు.