దేశం కోసం పోరాడుతూ ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన తెలుగు బిడ్డ మురళి నాయక్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇది చాలా దురదృష్టకరమని అత్తిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై పోరాడుతున్న భారత ఆర్మీకు దేశ ప్రజలంతా సంఘీభావం తెలిజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.