ఏలూరు: ఈనెల 11న చలో మంగళగిరి

51చూసినవారు
ఏలూరు: ఈనెల 11న చలో మంగళగిరి
కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 11న జరుగుతున్న చలో మంగళగిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ కోరారు. సోమవారం ఏలూరులో కౌలు రైతుల చలో మంగళగిరి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతుల సమస్యలు పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్