భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గోకా ప్రసాదరావు 2020లో పనిచేస్తూ అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు. ఆయన కుమార్తెకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ నియామక ఉత్తర్వులను ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ బుధవారం అందజేశారు. పోలీసు విభాగంలో విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబాలను ప్రోత్సహించడం, ఆదుకోవడం తమ ప్రధాన బాధ్యత అన్నారు.