ఏలూరు: పసికందు హత్య కేసులో తండ్రికి ఐదేళ్ల జైలు శిక్ష

77చూసినవారు
ఏలూరు: పసికందు హత్య కేసులో తండ్రికి ఐదేళ్ల జైలు శిక్ష
ఏలూరులో పసికందు హత్య కేసులో న్యాయస్థానం బుధవారం తీర్పు వెల్లడించింది. భార్యపై అనుమానాలు, విభేదాల నేపథ్యంలో కుమార్తె రుఫీనాను 2018లో రవితేజ  కొట్టి చంపిన కేసులో నేరం రుజువై అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. తాగుడుకు బానిసైన రవితేజ తరచూ భార్యను వేధించేవాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించిన రుఫీనా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్