కొల్లేరు ప్రజలను రక్షించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్న భారాలు ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర నాయకులు బి. బలరాం, మంతెన సీతారాంలు డిమాండ్ చేశారు. సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ సమావేశం గురువారం ఏలూరు జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆక్వా రంగాన్ని కాపాడాలని, రొయ్యల రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.