ఏలూరు జిల్లా రెవెన్యూ డివిజనల్ ఆఫీసుల వద్ద వృద్ధుల సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ చెప్పారు. ఆదివారం ఏలూరు ప్రేమాలయం వృద్ధాశ్రమంలో జరిగిన ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవంలో పాల్గొన్నారు. వృద్ధులు తమ సమస్యల కోసం 08812-224555 నంబర్కు నేరుగా ఫోన్ చేయవచ్చని సూచించారు.