లోబ్రిడ్జి సమస్య శాశ్వత పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపట్టామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శనివారం అధికారులతో కలిసి ఆయన లో బ్రిడ్జ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళి పరిష్కారం దిశగా కృషిచేస్తానన్నారు.