మే 20వ తేదీన జరగబోయే దేశవ్యాప్త గ్రామీణ బంద్ లో ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునిస్వామి పిలుపునిచ్చారు. రాపాక గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెతో పాటు, గ్రామీణ బంద్ ప్రాధాన్యతను వివరించారు.