ఓ బాలిక కష్టాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య బుధవారం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఏలూరులోని కొత్తపేటకు చెందిన ఎం. జ్ఞానేశ్వరి అనే 14 ఏళ్ల బాలిక లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు లివర్ మార్పిడి ఆపరేషన్ అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఆ బాలిక కుటుంబం స్థానిక ఎమ్మెల్యే చంటి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సీఎం సహాయనిది అందించాలని చంద్రబాబును కోరారు.