రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ, సిట్ వెల్, ఏలూరు వారి ఆధ్వర్యంలో గురువారం సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించినట్లు సెట్ వెల్ ముఖ్యకార్యనిర్వాహణాధికారి మదుభూషణ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ జనాభా దినోత్సవంపై వకృత్వం, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.