ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ స్వరూపారాణి ఆదివారం జిల్లాలో పనిచేస్తున్న డీఎస్పీలు, సిఐలు ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జూలై 1 నుంచి అమలు చేసే నూతన చట్టాలపై అధికారులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడారు. 1860 సంవత్సరం నుండి అమలులో ఉన్నటువంటి చట్టాలకు బదులుగా నేటి ఆధునిక ప్రపంచానికి అనుకూలమైన చట్టాలను రూపకల్పన చేసి శాసన సంబంధమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చారన్నారు.