ఆరోగ్యకర సమాజంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని గజపతినగరం సీఐ జిఏవి రమణ అన్నారు. గురువారం గజపతినగరంలోని ప్రభుత్వడిగ్రీ కళాశాలలో పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఆరోగ్యాన్ని నాశనం చేసే గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.