రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 66 మండలాల్లో వడగాల్పులు వీస్తామని వాతావరణ శాఖ హెచ్చరించింది. వీటి ప్రభావం ఎక్కువగా.. కృష్ణాజిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు జిల్లాలోని మండలాల్లో ఉంటుందని తెలిపింది. ఈ మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని పేర్కొంది. వీలైనంత వరకు ప్రజలు ఎండలో బయటకు రాకపోవడం మంచిదని సూచించింది. అలాగే చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు పాటించాలంది.