చాగల్లు గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ కాలనీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తలారి వెంకట్రావు పాల్గొన్నారు. అనంతరం చాగల్లు మండల నాయకులు మరియు అధికారుల సమీక్ష సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ సమావేశంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.