క్రైస్తవ సోదరుల మాల విరమణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్డీఓ దాసి రాజు అన్నారు. మొగల్తూరులోని మండల పరిషత్ కార్యాలయ భవనంలో గురువారం మండల స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా లక్షలాదిమంది క్రైస్తవ సోదరులు మాల విరమణకు బీచ్ లోని చర్చికి వస్తారని ఈ సందర్భంగా వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.