ఈనెల 12, 13 తేదీల్లో విద్యార్థులకు బస్ పాస్లు ఇవ్వబోమని నరసాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్బన్న రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 14 నుంచి బస్ పాస్ ఇవ్వనున్నట్లు చెప్పారు. కొత్త పాస్లు తీసుకునే విద్యార్థులు బస్పాస్ అప్లికేషన్ ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుంటే బస్సు పాస్ కౌంటర్లో క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదని, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.