నరసాపురం: ట్రేడింగ్ పేరుతో మోసం కేసు. ఇద్దరు అరెస్ట్

60చూసినవారు
నరసాపురం: ట్రేడింగ్ పేరుతో మోసం కేసు. ఇద్దరు అరెస్ట్
ట్రేడింగ్ లో లాభాలొస్తాయని నమ్మించి నరసాపురంకు చెందిన సందీప్ అనే వ్యక్తిని రూ.54 లక్షలు మోసం చేసిన కేసులో కోల్ కతాకు చెందిన ఇద్దరు నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది నవంబర్ 24న స్టాక్ మార్కెట్ లో షేర్లు విక్రయించిన వెంటనే 70వేల షేర్లు వచ్చాయని, అందుకు రూ.1,65,97,000 చెల్లించాలని నేరగాళ్లు సూచించడంతో సందీప్ అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను స్థానిక న్యాయస్థానంలో హాజరు పర్చామని సీఐ యాదగిరి తెలిపారు.

సంబంధిత పోస్ట్