నరసాపురం - అరుణాచలం మధ్య ప్రతి బుధవారం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు స్టేషన్ మేనేజర్ గణపతి మధుబాబు శుక్రవారంచెప్పారు. మధ్యాహ్నం 1 గంటకు నరసాపురం నుంచి 07219 నంబర్ ప్రత్యేక రైలు బయలుదేరి వయా తిరుపతి మీదగా గురువారం ఉదయం 4. 55 గంటలకు తిరువన్నామలై చేరుకుంటుంది. తిరిగి గురువారం ఉదయం 11 గంటలకు 07220 నంబర్తో తిరువన్నామలైలో బయలుదేరి శుక్రవారం ఉదయం 2 గంటలకు నరసాపురం చేరుకుంటుందన్నారు.