ఆదివారం సెలవు దినం కావడంతో మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కుటుంబాలతో వచ్చిన వారు సముద్రంలో స్నానం చేసి, ఇసుక తిన్నెలపై ఆటలాడుతూ సరదాగా గడిపారు. బీచ్ పరిసరాల్లో సందడిగా కనిపించింది. భద్రత కోసం మొగల్తూరు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.