సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత నిర్వహణకు సిబ్బంది సహకరించాలని నర్సాపురం ఆర్డీవో అచ్యుత్ అంబరీశ్ అన్నారు. బుధవారం నరసాపురం వైఎన్ కళాశాలలో పోలింగ్ అధికారులకు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. శిక్షణ తరగతుల్లో నరసాపురం, మొగల్తూరు తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.