చింతలపూడిలో జరిగే సీపీఐ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని రైతు సంఘం నేత మడుపల్లి నాగేందర్రావు, సీపీఐ నూజివీడు ఏరియా సమితి కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ ముసునూరులో పిలుపునిచ్చారు. కూటమి పాలనలో ఏడాది అయినా అభివృద్ధి లేకపోవడం బాధగా ఉందన్నారు. జిల్లా మహాసభల్లో రాజకీయ కార్యాచరణ జరుగుతోందని, ఐక్య పోరాటాలతో హక్కులు సాధిస్తామని తెలిపారు.