నిత్యావసర సరుకులు తక్కువ ధరకే ప్రజలకు అందించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం పాలకొల్లు పట్టణంలో ది పాలకొల్లు మర్చంట్ రైస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ విక్రయ కౌంటర్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సబ్సిడీ ధరలకు ప్రభుత్వం అందించే సరుకులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.