సఖినేటిపల్లి మండలం అంతేర్వేది శ్రీ లక్ష్మినర్సింహాస్వామి సుదర్శన్ హోమం సందర్బంగా టీటీడీ దేవస్థాన పాలక మండలి మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు స్వామి వారిని సోమవారం దర్శించుకున్నారు. ఆలయాధికారులు వేద పండితులు స్వాగతం పలికి ఆయనకు ఆశీర్వాదం అందజేశారు. అనంతరం ఆయన అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులకు భోజనం వడ్డీంచారు. దేవరపల్లి సత్తిబాబు, తొంటా మునిశ్వర్, దేశంశెట్టి రాము, ఆలయ కమిటీ సభ్యులున్నారు.