పాలకొల్లు: జగన్ పాలనపై మంత్రి నిమ్మల ఫైర్

53చూసినవారు
పాలకొల్లు: జగన్ పాలనపై మంత్రి నిమ్మల ఫైర్
నాడు జగన్ పాలన చీకటి మయమైతే.. నేడు చంద్రబాబు పాలన స్వర్ణయుగమని మంత్రి నిమ్మల రామానాయుడు అభివర్ణించారు. గురువారం పాల్లకొల్ల నియోజకవర్గంలో ‘మన రైతు,మన రామానాయుడు’ కార్యక్రమంలో భాగంగా శివదేవుని చిక్కాల, బల్లిపాడు గ్రామాల్లో రూ.1.71 కోట్లతో పంట కాలువల గ్రావెల్ రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ..రాష్ట్ర బడ్జెట్లో జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు కేటాయించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్