కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానం పట్ల పాలకొల్లు నియోజకవర్గం పోడూరు మండలం టీడీపీ అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇసుక మాఫియాను తయారుచేసి ఇసుకలో సుమారు 50, 000 కోట్ల వరకు అవినీతి జరిగిందని అన్నారు.