ప్రజల నుంచి వస్తున్న సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించకుంటే చర్యలు తప్పవు. పనిచేయని వారిని వదులుకోవడానికి సంస్థ సిద్ధంగా ఉంది’ అని జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ సాల్మన్రాజు అధికారులను, సిబ్బందిని హెచ్చరించారు. బుట్టాయగూడెంలో శుక్రవారం ఆయన సబ్ స్టేషన్ అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ‘ఆర్డీఎస్ స్కీమ్ విషయంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.