పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కుటుంబ సభ్యులను గురువారం బుట్టాయిగూడెం మండలం దుద్దుకూరులో మాజీ మంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఇటీవల తెల్లం బాలరాజు తల్లి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి మాజీ మంత్రి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ కవూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.