జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం పంచాయతీ జిల్లెల్లగూడెం గిరిజన గ్రామాన్ని మంగళవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు. జల జీవన్ మిషన్లో భాగంగా గ్రామానికి 29. 7 లక్షల వ్యయంతో నూతన మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రామాలయం నిర్మాణానికి గ్రామస్థుల కోరిక మేరకు రూ. 50వేల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు.