ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలం శ్రీధరవేలేరు గ్రామశివారు పాములేరు నది అటవీప్రాంతంలో సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు శనివారం దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా దాచి పెట్టిన 3600 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేశారు. ఎక్సైజ్ సీఐ శ్రీను బాబు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.