వేసవి దృస్ట్యా ప్రజలందరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని బొర్రంపాలెం పీహెచ్సీ వైద్యాధికారి ఎఎం ఆంజనేయులు సూచించారు. శనివారం పీహెచ్సీ పరిధిలోని వల్లంపట్ల గ్రామంలో ఎఫ్ఈసి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 50మంది షుగర్, బీపీ ఉన్నవారికి వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. అలాగే గర్భిణీకు వైద్య పరీక్ష లు నిర్వహించారు. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీద అవగాహన కల్పించారు.