మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే బాలరాజు హాజరయ్యారు. సమస్యలతో వస్తున్న ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు పరిష్కరించే మార్గంగా అధికారులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో తప్పకుండా న్యాయం జరుగుతుంది ఎవ్వరూ అధైర్యపడవద్దని ఎమ్మెల్యే అన్నారు.